రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
- March 12, 2019
15 నుంచి 16 ఏళ్ళ మధ్యనున్న నలుగురు టీనేజర్స్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రస్ అల్ ఖైమాలోని మౌంటెయిన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకోగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్ టీమ్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. ఇదిలా వుంటే కొద్ది రోజుల క్రితమే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు టీనేజర్స్ ప్రాణాలు కోల్పోయారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, మరీ ముఖ్యంగా యువకులు వాహనాల్ని జాగ్రత్తగా నడపాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









