రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

- March 12, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

15 నుంచి 16 ఏళ్ళ మధ్యనున్న నలుగురు టీనేజర్స్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రస్‌ అల్‌ ఖైమాలోని మౌంటెయిన్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకోగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి ట్రాఫిక్‌ పెట్రోల్స్‌, అంబులెన్సెస్‌, సివిల్‌ డిఫెన్స్‌ టీమ్‌, పారామెడిక్స్‌, రెస్క్యూ టీమ్స్‌ చేరుకున్నాయి. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. ఇదిలా వుంటే కొద్ది రోజుల క్రితమే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు టీనేజర్స్‌ ప్రాణాలు కోల్పోయారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, మరీ ముఖ్యంగా యువకులు వాహనాల్ని జాగ్రత్తగా నడపాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com