సౌదీ అరేబియా:బిడ్డను ఎయిర్పోర్ట్లోనే మరచిపోయి విమానమెక్కిన తల్లి!
- March 12, 2019సౌదీ అరేబియా: విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఏదో సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ అయిన విమానం నిమిషాల్లోనే తిరిగి దిగడం సాధారణమే. అయితే సౌదీ అరేబియాలోని జెడ్డా ఎయిర్పోర్ట్లో ఇలాగే ఓ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. ఎందుకో తెలుసా.. ఆ విమానంలోని ఓ ప్రయాణికురాలు తన బిడ్డను ఎయిర్పోర్ట్లోనే మరచిపోయి విమానమెక్కింది. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి తిప్పాలని అనుకుంటున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులకు విమాన సిబ్బంది సమాచారమిచ్చారు. సాధారణంగా ఎమర్జెన్సీ సమయాల్లోనే ఇలాంటి వాటికి అనుమతి ఇచ్చే ఎయిర్పోర్ట్లు ఈ విషయంలో ఏం చేయాలో తెలియక కాసేపు అయోమయానికి గురయ్యాయి. ఈ విమానం తిరిగి రావడానికి అనుమతివ్వాలని కోరుతోంది. ఎందుకంటే ఓ ప్రయాణికురాలు తన బిడ్డను ఎయిర్పోర్ట్లోనే మరచిపోయింది. మేము తిరిగి రావాలా వద్దా అని పైలట్ ఏటీసీని అడిగాడు. అయిలే పైలట్ ఏం చెప్పాడో అర్థం కాక..
సరైన కారణమేంటో మరోసారి చెప్పు అని ఆ ఆపరేటర్ ప్రశ్నించాడు. దీనికి మరోసారి పైలట్ నుంచి అదే సమాధానం వచ్చింది. దీంతో మరో దారి లేక విమానం తిరిగి రావడానికి ఏటీసీ అనుమతినిచ్చింది. విమానం దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ అధికారులు ఆ బిడ్డను తల్లికి అప్పగించారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..