ఒమన్ బోట్ ట్రాడెడీ: చివరి మృతదేహం లభ్యం
- March 15, 2019మస్కట్: హృదయ విదారకమైన బోట్ యాక్సిడెంట్కి సంబంధించి చివరి మృతదేహాన్ని ఎట్టకేలకు అధికారులు కనుగొన్నారు. రాయల్ ఒమ్ పోలీస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. విలాయత్ ఆఫ్ మహౌత్ షోర్లైన్లో ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. మార్చి 8న ఆరుగురు ఒమనీ పౌరులు, వలాయత్ ఆఫ్ మహౌత్ మీదుగా ఫిషింగ్ ట్రిప్కి వెళ్ళారు. ఈ క్రమంలో బోటు మునిగిపోయింది. స్థానికంగా వున్నవారు ఈ ప్రమాదాన్ని గుర్తించి, ఇద్దర్ని రక్షించగలిగారు. అయితే మరో ఇద్దర్ని మాత్రం కాపాడలేకపోయారు, వారి మృతదేహాల్ని బయటకు తీసుకొచ్చారు. మరో ఇద్దరు గల్లంతు కాగా, అందులో ఒకరి మృతదేహం బుధవారం దొరికింది. ఇప్పుడు మరో మృతదేహం దొరికిందని, ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు