ఇరాక్ లో ఘోర పడవ ప్రమాదం 100 మంది మృతి
- March 22, 2019బాగ్దాద్:ఇరాక్లోని మోసుల్ సమీపంలో టైగ్రిస్ నదిలో గరువారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో పాటు నదీ ప్రవాహం అధికంగా ఉండటంతో పడవ మునకకు గురై నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 100 మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రతినిధి సైఫ్ అల్ బద్ర్ తెలిపారు. ఇప్పటివరకు 30 మందిని రక్షించామని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే పడవలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న సమాచారం తెలియదని అన్నారు. పర్యాటక ప్రాంతమైన నౌరజ్లో కుర్దిష్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ప్రయాణికులు ఈ పడవలోకి ఎక్కారని సివిల్ డిఫెన్స్ అధికారి కల్నల్ హుస్సామ్ ఖలీల్ వెల్లడించారు. ప్రతీ ఏడాది వసంత రుతువులో ఈ వేడుకను జరుపుకుంటారని అన్నారు. పడవలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగిందని, సహాయం అందించేందకు పక్కన మరో పడవలు లేకపోవడంతో మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు