ఏపీ లో రిలీజ్ అవ్వనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'
- April 10, 2019సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'మొదటి నుంచి ఎన్నో వివాదాలు సృష్టిస్తూ వచ్చింది. ఈ సినిమా టీడీపీ అధినేత చంద్రబాబు ను విమర్శించేలా ఉందని ఒక వర్గం వారు పోలీసు కేసులు పెట్టడం..కోర్టు మెట్లక్కడం ఎన్నో రకాలుగా మూవీ రిలీజ్ ఆపే ప్రయత్నం చేశారు. ఈ మూవీ గత నెల 29 ఒక్క ఏపిలో తప్ప అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది. ఇక తెలంగాణాలో సినిమా రిలీజ్ అవటంతో...బాగుందని టాక్ రావటంతో ఈ మూవీపై ఆంధ్రా జనాల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ నేపథ్యంలో పైరసీ ప్రింట్ ఎపిలో కనిపించింది..చాలా మంది వీక్షించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ఏపీలో విడుదలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఇవాళ మధ్యాహ్నం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం వీక్షించనుంది. న్యాయమూర్తుల చాంబర్లో న్యాయవాదుల సమక్షంలో ఈ మూవీ ప్రదర్శించనున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఈ వారంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదల అవుతుందని దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. వాదాలు, వివాదాలు, సవాళ్లు, ఒత్తిళ్లు మధ్య రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రెండువారాల క్రితం తెలంగాణలో విడుదలైంది.
కోర్ట్ తీర్పు కారణంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం రిలీజ్ ఆగి పోయిన విషయం తెలిసిందే. సినిమాకు హైప్ తీసుకురావడం, చంద్రబాబుని విలన్ గా చూపటం వంటి అంశాలు వల్ల తెలంగాణలో ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ తెచ్చాయి. ఏప్రియల్ 12న సినిమా రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..