తెరపైకి మరో పొలిటికల్ లీడర్ బయోపిక్
- April 10, 2019మరో పొలిటికల్ లీడర్ బయోపిక్ తెరకెక్కుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితపై బయో పిక్ రూపొందుతోంది. ఈ సినిమాకు శశిలలిత అని పేరు పెట్టారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ లను రిలీజ్ చేశారు.
వివాదాస్పద దర్శక-నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, జయలలిత బయోపిక్ను తెరకెక్కిస్తున్నారు. శశిలలిత పేరుతో రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోందన్నారు. జయ జీవితంలోని కీలకమైన అంశాలతో సినిమాను రూపొందిస్తున్నామని, త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్తామని కేతిరెడ్డి తెలిపారు.
లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా పేరుతో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వార్తల్లోకి వచ్చారు. రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్కు పోటీగా లక్ష్మీస్ వీరగ్రంథం తీస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పుడేమో జయలలిత జీవితకథ ఆధారంగా సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు