కేరళ విషు ఫెస్టివల్ సద్యా కోసం సిద్ధమైన ఖతార్ రెస్టారెంట్స్
- April 15, 2019భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వలసదారులకోసం ఖతార్లోని రెస్టారెంట్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. కేరళ వాసులకు ఎంతో ప్రత్యేకమైన విషు ఫెస్టివల్ నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేశాయి ఆయా రెస్టారెంట్స్. ఈ ఫెస్టివల్లో ప్రత్యేకమైన మిడ్ డే మీల్ సాద్యాని అందించేందుకు రెస్టారెంట్స్ సన్నాహాలు పూర్తి చేశాయి. సాద్యాలో 24 నుంచి 28 డిషెస్ సింగిల్ కోర్స్లో వుంటాయి. అతి పెద్దది 64కి పైగా ఐటమ్స్ని కలిగి వుంటుంది. కేరళలోని వివిధ ప్రాంతాల్ని బట్టి ఇంగ్రెడియంట్స్ కొంచెం అటూ ఇటూగా మారతాయి. అన్నిటిలోనూ కామన్గా వుండే రైస్, పికెల్, దాల్, అవియాల్, కూట్టుక్కరి అతి ముఖ్యమైనవి. కేరళ వాసుల కోసం ఆయా ఆహార పదార్థాలకు సంబంధించిన ఇంగ్రెడియంట్స్ని హైపర్ మార్కెట్స్ అందుబాటులో వుంచాయి. ఇంట్లో వంట చేసుకునే తీరిక లేనివారికి రెస్టారెంట్స్ అద్భుతమైన రుచితో సాద్యా ప్యాకేజీలను రూపొందించి అందుబాటులోకి తెచ్చాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!