కువైట్ విమానాశ్రయంలో బాంబు కలకలం
- April 15, 2019కువైట్: కువైట్ విమానాశ్రయంలో ఓ గుర్తు తెలియని పార్శిల్ కలకలం సృష్టించింది. కువైట్ నుంచి అమెరికాకు దాన్ని కొరియర్ చేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఓ పుస్తకం సైజులో ఉన్న ఆ పార్శిల్ ఏంటో, ఎవరు పంపారో వివరాలు తెలియరాలేదు. ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ఆ ప్యాకేజిని పరిశోధించడానికి ఫోరెన్సిక్ నిపుణులకు పంపించింది. రొటీన్ కార్గో చెకింగ్లో భాగంగా కొరియర్ చేస్తున్న వస్తువులను పరిశీలిస్తుండగా ఈ అనుమానాస్పద పార్శిల్ బయటపడిందని అధికారులు తెలిపారు. ఈ పార్శిల్లో బాంబు ఉందేమోనని వారు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పార్శిల్లో బ్యాటరీలు, డైనమైట్ తయారీలో ఉపయోగించే టీఎన్టీ అనే పదార్థం ఉన్నాయని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ పార్శిల్ను పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..