షార్జా ఛారిటీ ఇంటర్నేషనల్: 41 మిలియన్ దిర్హామ్ల రమదాన్ సాయం
- April 22, 2019షార్జాలోని ఓ ఛారిటీ 41 మిలియన్ దిర్హామ్ల ఛారిటీ క్యాంపెయిన్ని ఈ ఏడాది రమదాన్ కోసం కేటాయించింది. తద్వారా అవసరమైనవారికి దేశంలోనూ, అలాగే విదేశాల్లోనూ రమదాన్ సాయం అందిచనున్నామని నిర్వాహకులు తెలిపారు. షార్జా ఛారిటీ ఇంటర్నేషనల్ సెక్రెటరీ జనరల్ అబ్దుల్లా అల్ దుకాన్ మాట్లాడుతూ, పవిత్ర రమదాన్ మాసం కోసం ఐదు ఛారిటబుల్ ప్రాజెక్ట్లకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. 2 మిలియన్ దిర్హామ్ల విలువైన మీల్స్ని 3,000 కుటుంబాలకు అందించడం ఇందులో మొదటిది. 1 మిలియన్ ఇఫ్తార్ మీల్స్ని 148 ప్రాంతాల్లో (యూఏఈ), 56 దేశాల్లో 200,000 మీల్స్ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జకాత్ అకౌంట్ ద్వారా 15 మిలియన్ దిర్హామ్లను వినియోగిస్తారు. పవిత్ర రమదాన్ మాసం ముగిశాక జకత్ అల్ ఫితర్ డిస్ట్రిబ్యూషన్ కోసం 2 మిలియన్ దిర్హామ్లను కేటాయిస్తున్నారు. పెద్దయెత్తున మంచి మనసున్నవారి నుంచి అందుతున్న నిధులతో ఇవన్నీ చేయగలుగుతున్నట్లు అల్ దుఖాన్ చెప్పారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం