శ్రీలంక పేలుళ్ళను ఖండించిన సుల్తానేట్
- April 22, 2019మస్కట్: అత్యంత కిరాతకంగా జరిగిన వరుస పేలుళ్ళు శ్రీలంకలో పరిస్థితిని భీతావహంగా మార్చేయడంపై ఒమన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పేలుళ్ళను ఖండిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా, దాన్ని అంతమొందించాల్సిందేననీ, ఈ కష్టకాలంలో శ్రీలంకకు తాము అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఒమన్ పేర్కొంది. ప్రస్తుతం శ్రీలంకలో వున్న ఒమన్ పౌరుల భద్రత విషయమై అక్కడి ఎంబసీతో మినిస్ట్రీ సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు ఫోన్ నెంబర్లను ప్రకటనలో పేర్కొని, అత్యవసర సందర్భాల్లో ఒమన్ పౌరులు, శ్రీలంకలో ఈ నెంబర్లను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్