రన్ ఓవర్ యాక్సిడెంట్: డ్రైవర్ అరెస్ట్
- April 26, 2019షార్జా:షార్జా పోలీసులు ఓ డ్రైవర్ని రన్ ఓవర్ కేసులో అరెస్ట్ చేశారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడినుంచి డ్రైవర్ పారిపోయినట్లు తెలిపిన అధికారులు, ఈ ఘటనలో ఆఫ్రికాకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని, బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో అతను మృతి చెందడం జరిగింది. డ్రైవర్లు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలనీ, ప్రమాదాలు జరిగితే అక్కడే వాహనాన్ని ఆపి, బాధితులకు సహాయ చర్యలు అందించాలని షార్జా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం