బుర్జ్ ఖలీఫాకి శ్రీలంక జెండా వెలుగులు
- April 26, 2019దుబాయ్లోని ప్రముఖ నిర్మాణం బుర్జ్ ఖలీఫా శ్రీలంక జెండా వెలుగులతో దర్శనమిచ్చింది. ప్రపంచంలో శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సహనంతో వ్యవహరించాలని ఈ సదర్భంగా బుర్జ్ ఖలీఫా యాజమాన్యం ఆకాంక్షించింది. బుర్జ్ ఖలీఫాతోపాటు అబుదాబీలోని ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ శ్రీలంక జాతీయ జెండా వెలుగులతో కనిపించాయి. ఎమిరేట్స్ ప్యాలెస్, షేక్ జాయెద్ బ్రిడ్జి, అడ్నాక్ బిల్డింగ్, క్యాపిటల్ గేట్ కూడా శ్రీలంక రంగులతో నిండిపోయాయి. ఈస్టర్ ఆదివారం పవిత్ర ప్రార్థనలు చేస్తున్న సమయంలో శ్రీలంకలో తీవ్రవాదులు మారణహోమానికి పాల్పడి దాదాపు 400 మంది ప్రాణాలు బలిగొన్న విషయం విదితమే. 500 మందికి పైగా క్షతగాత్రులు తమ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికీ పేలుళ్ళ టెన్షన్ శ్రీలంకలో తగ్గలేదు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!