120,000 అక్రమ వలసదారుల కోసం వేట
- April 29, 2019కువైట్:దేశంలో 120,000 మంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారనే అంచనాలతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఆయా వ్యక్తుల జాడ కనుగొనేందుకు సంబంధిత శాఖల ద్వారా 'వేట' కొనసాగిస్తోంది. ఉల్లంఘనుల్లో కొందరు తమ రెసిడెన్స్ పర్మిట్ని వివిధ కారణాలతో రెన్యూ చేసుకోలేకపోయినట్లు మినిస్ట్రీ భావిస్తోంది. అలాగే మరికొందరు విజిట్ వీసాలపై వచ్చి, ఆ తర్వాత గడువు తీరినా దేశం విడిచి వెళ్ళకుండా వుండిపోయినట్లు పేర్కొంటున్నారు అధికారులు. అయితే, ఏ కారణాలతో అయినా అక్రమ నివాసితులుగా వున్నవారిని అరెస్ట్ చేయడం తప్పనిసరి అని మినిస్ట్రీ చెబుతోంది. కాగా, డిపార్ట్మెంట్ ఆఫ్ డిపోర్టేషన్ గత కొద్ది రోజుల్లో 620 మంది వలసదారుల్ని డిపోర్ట్ చేయడం జరిగింది. వీరిలో 18 మంది మహిళలు వున్నారు. డిపోర్టేషన్ సెంటర్ కెపాసిటీ 800 మంది మాత్రమే.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ