కాబూల్:24 మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం..
- May 12, 2019కాబూల్: అఫ్గానిస్థాన్ భద్రతా బలగాలు తమ దేశంలోని హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. అఫ్గాన్ మిలిటరీ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... 20 మంది తాలిబన్లను పక్తీకా ప్రావిన్సులోని జుర్మాత్, బెర్మాల్ జిల్లాల్లో హతమార్చారు. గజనీ ప్రావిన్సులోని అందర్ జిల్లాలో ఇద్దరు, హేరాత్ ప్రావిన్సులోని ఫర్సీ జిల్లాలో మరో ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. అఫ్గాన్ వ్యాప్తంగా తాలిబన్లు ఉగ్రవాద చర్యలను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలపై తాలిబన్లు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
తాలిబన్లు, ఐఎస్ ఉగ్రవాదుల చర్యల కారణంగా అఫ్గానిస్థాన్.. రాజకీయ అస్థిరత, సామాజిక, భద్రత సమస్యలను ఎదుర్కొంటోంది. దేశంలోని ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ఇతర దేశాల భద్రతా బలగాల సాయంతో ఆఫ్గాన్ బలగాలు ఉగ్ర వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సులతో పాటు హెల్మాంద్, ఉరుజ్గాన్, జాబూల్, నంగర్హర్ ప్రావిన్సుల్లోనూ భద్రతా బలగాలు ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులు జరుపుతున్నాయి.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..