ప్రముఖ నిర్మాత కన్నుమూత
- May 12, 2019
ప్రముఖ నిర్మాత వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. ఈ ఉదయం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న వెంకట్రామిరెడ్డి ఉదయం అస్వస్థతకు గురై అనంతరం తిరిగిరాని లోకాలు వెళ్ళిపోయారు. విజయా సంస్థల అధినేత నాగిరెడ్డి కుమారుడైన వెంకట్రామిరెడ్డి ఆ బ్యానర్పై పలు చిత్రాలను నిర్మాతగా వ్యవహరించారు. తమిళ సూపర్ స్టార్స్ అజిత్, విజయ్, విశాల్, ధనుష్లతో పలు చిత్రాలు తీశారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకు ప్రతియేటా పురస్కారాలను అందిస్తూ వచ్చారు. ఆయన మృతి పట్ల పలు సీని,రాజకీయ రంగ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







