ప్రముఖ నిర్మాత కన్నుమూత
- May 12, 2019
ప్రముఖ నిర్మాత వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. ఈ ఉదయం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న వెంకట్రామిరెడ్డి ఉదయం అస్వస్థతకు గురై అనంతరం తిరిగిరాని లోకాలు వెళ్ళిపోయారు. విజయా సంస్థల అధినేత నాగిరెడ్డి కుమారుడైన వెంకట్రామిరెడ్డి ఆ బ్యానర్పై పలు చిత్రాలను నిర్మాతగా వ్యవహరించారు. తమిళ సూపర్ స్టార్స్ అజిత్, విజయ్, విశాల్, ధనుష్లతో పలు చిత్రాలు తీశారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకు ప్రతియేటా పురస్కారాలను అందిస్తూ వచ్చారు. ఆయన మృతి పట్ల పలు సీని,రాజకీయ రంగ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







