బ్రెజిల్:బార్‌లో కాల్పులు 11 మంది మృతి

- May 20, 2019 , by Maagulf
బ్రెజిల్:బార్‌లో కాల్పులు 11 మంది మృతి

బెలెమ్‌: బ్రెజిల్‌లోని పారా రాష్ట్రం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బెలెమ్‌ నగరంలోని ఓ బార్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకరాం..కార్లు, బైక్‌లపై వచ్చిన ఏడుగురు సాయుధ దుండగులు బార్‌లోకి ప్రవేశించి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఘటన అనంతరం దుండగులు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు. ఓ నిందితుడిని పట్టుకోగా.. మిగిలినవారు పరారయ్యారు. కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com