పీఎంఎస్బీవై ఇన్సూరెన్స్ స్కీం..
- May 20, 2019ఏ ప్రమాదమూ తెలిసి జరగదు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు అక్కరకొస్తాయి ఇన్సూరెన్స్ పాలసీలు. అందుకే జీవిత బీమా, ఆరోగ్య బీమాతో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలజీ తీసుకుంటే ఉత్తమం. ప్రభుత్వం కూడా సామాజిక భద్రత నేపథ్యంలో పలు స్కీములు అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బావై) ఒకటి. ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవిస్తే ఈ పాలసీ కొంత ఆర్థిక ధైర్యాన్ని ఇస్తుంది.
పీఎంఎస్బావై యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పాలసీ వ్యవధి సంవత్సరము. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. స్కీమ్లో జాయిన్ అయ్యే ముందే ఆటో డెబిట్ ఫెసిలిటీ ఏర్పాటు అంగీకారం తెలపాలి. అంటే మీ అకౌంట్ నుంచి పాలసీ ప్రీమియం ప్రతి ఏడాది ఆటోమేటిక్గా కట్ అవుతుంది. పాలసీ ప్రీమియం ఏడాదికి రూ.12. మే 25 నుంచి 31 మధ్య కాలంలో పాలసీ ప్రీమియం మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు పాలసీ కవర్ వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా రూ.2 లక్షలు లభిస్తాయి. అదే పాక్షిక అంగవైకల్యానికి అయితే రూ.1 లక్ష వస్తుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం