మక్కా, జెడ్డాపై మిస్సైల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- May 22, 2019యెమెన్కి చెందిన తీవ్రవాదులు సౌదీ అరేబియాలోని మక్కా మరియు జెడ్డాపై దాడి కోసం మిస్సైల్స్ ప్రయోగించడాన్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఫారిన్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని సమర్థించకూడదని, ప్రపంచమంతా ఏకమై తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వుందని బహ్రెయిన్ పేర్కొంది. అత్యంత చాకచక్యంగా మిస్సైల్స్ని డిస్ట్రాయ్ చేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ని ఈ సందర్భంగా బహ్రెయిన్ అభినందించింది. సౌదీ అరేబియాకి బహ్రెయిన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందనీ, ఇస్లామిక్ సమాజం అంతా ఈ విషయమై ఒక్కతాటిపైకి రావాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది. తైఫ్ మీదుగా వస్తున్న మిస్సైల్స్ని సౌదీ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి. మిస్సైల్ శకలాలు వాడి జలీల్లో కూలిపోయాయి. కాగా, యెమనీ ప్రభుత్వం కూడా ఈ దాడుల్ని ఖండించింది. పవిత్ర నగరాలపై దాడులకు దిగడం ద్వారా తీవ్రవాదులు తమ హీనత్వాన్ని చాటుకున్నారని యెమెన్ వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి