ఇండియన్ టైకూన్ని సత్కరించిన షేక్ హమదాన్
- May 24, 2019దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ల్యాండ్ మార్క్ గ్రూప్ని ఫస్ట్ స్పోర్ట్స్ ఇంప్రింట్ అవార్డ్తో సత్కరించారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ మరియు వతానీ అల్ ఎమరాత్ ఫౌండేషన్ సహకారంతో ఈ అవార్డుని అందించారు. నాద్ అల్ షెబా స్పోర్ట్స్ టోర్నమెంట్ సందర్భంగా ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఛైర్మన్ కూడా అయిన షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ సందర్భంగా ల్యాండ్ మార్క్ గ్రూప్ ఛైర్మన్ మిక్కీ జగితియానీని సత్కరించారు. బెస్ట్ డయాబెటిస్ వాక్ పేరుతో డయాబెటిస్ పట్ల అవగాహన కలిగించేందుకు ల్యాండ్ మార్క్ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్ని అభినందించారు షేక్ హమదాన్. 20,000 మందికి పైగా పార్టిసిపెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అలాగే ఎమిరేట్స్ డయాబెటిస్ సొసైటీకి మద్దతుగా ల్యాండ్ మార్క్ పలు కార్యక్రమాలు చేపడుతోంది.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి