హవాలా కేసులో ఇండియన్ ప్రిన్సిపల్ అరెస్ట్
- May 24, 2019కువైట్: హవాలా కుంభకోణానికి సంబంధించి ఇండియాలో ఓ ముస్లిం క్లరిక్ మరియు బిజినెస్ మేన్ని అరెస్ట్ చేశారు. 8,45,000 రూపాయల్ని కువైట్ నుంచి పంపినట్లుగా నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. బార్పేటలోని జామియా ఇస్లామియా సలాఫియా అరబిక్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు నురుల్ ఇస్లామ్. అతని నుంచి డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా నిందితుడు తనకు ఆ సొమ్ము కువైట్ నుంచి వచ్చినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ కేసులో బిజినెస్ మేన్ ఆరోన్ సార్ఫ్ని కూడా అరెస్ట్ చేశారు. హవాలా డీల్కి అరోన్ సహాయ సహకారాలు అందిస్తారు. నురుల్ ఇస్లామ్ గతంలో 28,00,000 రూపాయల్ని యూనివర్సిటీ బ్యాంకింగ్ అకౌంట్లో మూడు సెపరేట్ ట్రాన్సాక్షన్స్ రూపంలో డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. అనైతిక కార్యకలాపాల కోసం నిందితుడు ఈ డబ్బుని వినియోగించి వుంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అండర్గ్రౌండ్ నెట్వర్క్ ద్వారా హవాలా సిస్టమ్ నడుస్తుంటుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్