రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ళ చిన్నారి మృతి

- May 24, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ళ చిన్నారి మృతి

బహ్రెయిన్:దార్‌ కులైబ్‌ విలేజ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నాలుగేళ్ళ చిన్నారిని బలి తీసుకుంది. హమాద్‌ టౌన్‌ దగ్గరలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన చిన్నారిని రీమ్‌ హుస్సైన్‌ అల్‌ అరాదిగా గుర్తించారు. ఓ ఫ్లవర్‌ షాప్‌ వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని ఢీకొంది. విలేజ్‌ ప్రారంభంలో తన తండ్రికి చెందిన ఓ ఫ్లవర్‌ షాప్‌ వద్దకు చిన్నారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌కి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. 'ఈ జీవితంలో నాకున్న ఒకే ఒక్క అతి ముఖ్యమైన వ్యక్తివి నువ్వు. నిన్ను నేను కోల్పోయాను. వింటున్నావా, నీ తండ్రి నిన్నెంతో ప్రేమిస్తున్నాడు' అని ఆ చిన్నారి తండ్రి తన కూతురి కోసం రాసిన అక్షరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి, చాలామందికి కంటతడి పెట్టిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com