ఎంపీగా టాలీవుడ్ హీరోయిన్..
- May 25, 2019ఎంపీగా పోటీ చేసిన మొదటి ప్రయత్నంలోనే అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్. ఆర్పి పట్నాయక్ అంధుడిగా నటించిన చిత్రం శీను వాసంతి లక్ష్మి చిత్రంలో నటించిన కౌర్ తన నటనకు గాను ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆమె కూడా రాజకీయాల్లో ప్రవేశించింది. మహారాష్ట్ర అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి శివసేన పార్టీ అభ్యర్థిపై 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. భర్త రాణా మొదటి నుంచి యువ స్వాభిమాన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. కౌర్ కూడా అదే పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది లోకసభలో అడుగుపెట్టనుంది. ఆమెకు 5 లక్షల 10 వేల ఓట్లు పోలయ్యాయి. కౌర్ భర్త రవి రాణా యోగా గురు బాబా రాందేవ్కు మేనల్లుడు. 2011లో 3100 మందికి జరుగుతున్న సామూహిక వివాహ మహోత్సవంలో రవి రాణా, నవనీత్ కౌర్ జంట కూడా ఒకటి.
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..