రాష్ట్రపతి భవన్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం
- May 30, 2019న్యూఢిల్లీ: నేడు ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనిరీతిలో అతిపెద్ద వేడుకగా ప్రధాని ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుంది. వివిధ దేశాధినేతలు, గత కేబినెట్ లోని మంత్రులు, దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు అందరూ కలుపుకుని దాదాపు 8 వేల మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. దీంతో ఢిల్లీ మొత్తం దాదాపు 10,000 పైగా మందితో భద్రతా బలగాలను మొహరించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాత్రి 7 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుండగా ఈ వేడుకకు హాజరయ్యే ప్రముఖులకు భద్రత కల్పిస్తూ ఇప్పటికే ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు బందోబస్తులో పాల్గొని ఢిల్లీని అనుక్షణం పహారా కాస్తున్నాయి.
ప్రమాణస్వీకారం నేపథ్యంలో నరేంద్ర మోదీ నేడు రాజ్ ఘాట్, సదైవ్ అటల్ సమాధి, నేషనల్ వార్ మెమొరియల్ వంటి పవిత్ర స్థలాలకు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే ప్రధానికి భారీ భద్రత కల్పిస్తూ ఎత్తైన భవనాలపై నుంచి స్పైపర్స్, షార్ప్ షూటర్స్ సైతం బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ