మహేష్ బ్యానర్లో విజయ్ సినిమా.!
- June 04, 2019మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. మంచి డబ్బులు వచ్చాయి. తరువాత బ్రహ్మోత్సవం సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా మారారు. సినిమా ఫెయిల్ కావడంతో సొంత బ్యానర్లో మరో సినిమా చేయలేదు. ఇప్పుడు మహేష్ మరలా తన సొంత బ్యానర్ జిఎంబి సినిమాస్ లో సరిలేరు నీకెవ్వరూ చేస్తున్నారు.
ఇదిలా ఉంటె, మహేష్ బాబు సొంత బ్యానర్లో బయట హీరోలతో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. జిఎంబి సినిమాస్ లో అడవి శేష్ తో మేజర్ అనే సినిమా చేస్తున్నాడు. మహెష్ బాబు నిర్మాత. ముంబై దాడుల్లో మరణించిన ఆఫీసర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు జిఎంబి సినిమాస్ ప్లాన్ చేస్తోంది. మహేష్ బాబు బ్యానర్లో సినిమా అంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ప్రస్తుతం నమ్రత ఆ బిజీలోనే ఉన్నారట. విజయ్ సినిమా కోసం కావాల్సిన కథను సిద్ధం చేయిస్తున్నారని వినికిడి.
మరో సమాచారం ప్రకారం, మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ మూవీలో విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదుగాని, ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఇది నిజమైతే మహెష్ 26 కు ఓ స్పెషల్ వచ్చినట్టే. గీత గోవిందం హీరో హీరోయిన్లు ఇద్దరు ఈ సినిమాలో నటించినట్టు అవుతుంది.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం