సీఎం హామీ..సమ్మె విరమించుకున్న ఆర్టీసీ!
- June 12, 2019అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఈరోజు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు ఈరోజు కలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలనీ, లేదంటే సమ్మెకు వెళ్లడం తప్ప తమకు మరో గత్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై సీఎం జగన్ స్పందిస్తూ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పొందే సౌకర్యాలన్నీ ఆర్టీసీ కార్మికులకు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి సంబంధించిన న్యాయపరమైన అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయంతో సంతృప్తి చెందిన ఆర్టీసీ జేఏసీ రేపటి నుంచి చేపట్టాల్సిన నిరవధిక సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. విలీన ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలలు పడుతుందని సీఎం చెప్పారన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్