ఇండోనేషియా, జపాన్లలో భూకంపం
- June 24, 2019ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. యందేనా ఐలాండ్లోని సోలంకి సముద్ర తీరం వద్ద భూకంపం తీవ్రత 7.5 గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఆదివారం రాత్రి పది గంటల సమయంలో సంభవించింది.
యాంబన్కు దక్షిణాన 321 కిలోమీటర్ల దూరంలో బండా సముద్ర తీరం వద్ద భూమికి 214 కి.మీ. లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 30 నిమిషాల కన్నా ఎక్కువే భూమి ప్రకంపించింది. అక్కడ సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని ప్రభుత్వం తెలపడంతో సునామీ పరిధిలోని ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సోమవారం తెల్లవారుఝామున జపాన్లోనూ భూకంపం చోటు చేసుకుంది. 5.5 తీవ్రతతో ఇది సంభవించినట్లు జపాన్ శాస్త్రవేత్తలు ఏజెన్సీ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు