పీక్స్ కి చేరిన చెన్నై నీటి ఎద్దడి
- July 12, 2019హైదరాబాద్: చెన్నై మహానగరం తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ వెల్లోర్ నుంచి చెన్నైకు ఓ ప్రత్యేక రైలును తీసుకువెళ్తున్నారు. నీటి బోగీలతో ఆ రైలు ఇవాళ ఉదయం జోలార్పేట్ రైల్వే స్టేషన్ నుంచి కాసేపటి క్రితం బయలుదేరింది. రైల్వే వ్యాగన్ల ద్వారా నీటిని చెన్నైకు తీసుకురానున్నట్లు ఇటీవల ప్రభుత్వం పేర్కొన్నది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆ రైలు చెన్నై స్టేషన్కు చేరుకోనున్నది. 50 బోగీల్లో సుమారు 50 వేల లీటర్ల నీళ్లు ఉన్నాయి. విల్లివక్కం వద్ద రాష్ట్ర మంత్రి ఆ రైలుకు స్వాగతం పలకనున్నారు. వ్యాగన్లలో ఉన్న నీటిని.. కిల్పాక్ వాటర్ వర్క్స్కు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కిల్పాక్ వాటర్ వర్క్స్ నుంచి నీటిని నగరమంతా సరఫరా చేయనున్నారు. మొత్తం రెండు రైళ్ల ద్వారా నీటిని తరలించనున్నారు. ఒక రైలు జోలార్పేట్ నుంచి, మరో రైలు అవది రైల్వే యార్డ్ నుంచి బయలుదేరనున్నాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం