హజ్ కోసం ఒమన్ నుంచి 14,000 మంది యాత్రికులు
- July 17, 2019మస్కట్: ఈ ఏడాది మొత్తం 14,000 మంది యాత్రికులు ఒమన్ నుంచి మక్కా పర్యటనకు వెళ్ళనున్నారు. హజ్ రిట్యువల్స్ కోసం వీరంతా మక్కాకి వెళ్ళనున్నారు. వీరిలో 13,500 మంది ఒమనీయులు కాగా, 250 మంది అరబ్స్, 250 మంది నాన్ అరబ్స్ వున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్స్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్ ఈ విషయాన్ని పేర్కొంది. 26,000 హజ్ అప్లికేషన్స్ ఈ ఏడాది వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఒమన్ అఫీషియల్ హజ్ డెలిగేషన్, జులై 28న పయనమవనుంది. రెలిజియస్ గైడెన్స్ రిప్రెజెంటేటివ్స్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ డెలిగేషన్, సూపర్ విజన్ ఆఫ్ హజ్ కంపెనీస్, మెడికల్ డెలిగేషన్ మరియు మీడియా ఇందులో వుండటం జరుగుతుంది. ఒమన్ హజ్ మిషన్ హెడ్ షేక్ సుల్తాన్ బిన్ సయీద్ అల్ హినాయ్ మాట్లాడుతూ, మినిస్ట్రీ 85 కంపెనీలను యాత్రికుల ట్రాన్స్పోర్టేషన్కి అనుమతిచ్చినట్లు తెలిపారు. హజ్ యాత్రీకుల్లో అత్యధికులు 18 నుంచి 60 ఏళ్ళ వయసు మధ్యనున్నవారే. వీరి శాతం 88.2గా వుంది. 65 శాతం మంది ఫిలిగ్రిమ్స్ ఆకాశ మార్గంలో వెళుతుండగా, 35 శాతం మంది రోడ్డు మార్గంలో వెళతారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్