జంపింగ్ రెడ్ లైట్స్: 4,000 మందికి పైగా మోటరిస్టులకు జరీమానా
- July 19, 2019అబుదాబీ: వేలాది మంది వాహనదారులకు ఈ ఏడాది అప్పుడే జరీమానాల్ని విధించారు ట్రాఫిక్ అధికారులు. రెడ్ లైట్ సిగ్నల్ జంపింగ్కి సంబంధించి 4,367 మంది వాహనదారులకు జరీమానాలు విధించినట్లు అబుదాబీ పోలీసులు వెల్లడించారు. తొలి ఆరు నెలల్లో ఈ ఉల్లంఘనలు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, రెడ్ సిగ్నల్ లైట్ జంప్ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 52 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మోటరిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ లైట్ జంప్ చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనదారుల భద్రత కోసమే ట్రాఫిక్ రూల్స్ వున్నాయని, వాటిని పాటించాల్సి వుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం