ఐఎస్ఐ అలజడులు.. ఐబి హెచ్చరికలు..ఈ మూడు రాష్ట్రాలను జల్లెడపడుతున్న పోలీసులు
- August 20, 2019ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లో భద్రతను మరింత పెంచిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు ప్రవేశించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఉగ్రవాదులు రూటు మార్చి రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐబి సమాచారం అందించింది. ఐబి అందించిన సమాచారంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ను ప్రకటించారు. ఈ మూడు రాష్ట్రాలను పోలీసులు జల్లెడపడుతున్నాయి.
దేశంలోకి నాలుగు ఐఎస్ఐ తీవ్రవాదులు ప్రవేశించారని సమాచారం అందటంతో.. హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని పోలీసులకు కేంద్రం ఆదేశించింది. కీలకమైన ప్రాంతాల్లో నిఘా పెంచాలని, అనుమానితులను ప్రశ్నించాలని, వాహనాలను తనిఖీ చేయాలని కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..