ఒమాన్ లో ఉపాధ్యాయుల గదికి నిప్పు పెట్టిన విద్యార్ధులు
- March 04, 2016గురువుగారి ఇంట్లో ఎలుక ఉందని...ఎంతకీ దొరకని దాన్ని ఎలాగైనా చంపాలని ఏకం గా కొంపకు నిప్పు పెట్టారు నాటి పాతకాలం పరమానందయ్య శిష్యులు..అసలు చదువు చెప్పేవారే లేకపోతే మనకు బడిలో ఎదురు ఉండదని బహుశా భావించేరేమో నేటి తరం ఆ గడుగ్గాయులు.....ఉపాధ్యాయుల గదికి నిప్పు పెట్టి రాయల్ ఒమాన్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. సోహార్ లోని ఒక పాఠశాలకు చెందిన అయిదుగురు ఉపాధ్యాయిని గదిని అగ్నికి ఆహుతి చేయబోయారు. ఈ విషయాన్ని పోలీసులకు కొందరు తెలియడంతో రాయల్ ఒమాన్ పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. కాగా అరెస్ట్ కాబడిన ఐదుగురు విద్యార్థులు తాము రోజూ సాయంత్రం పాఠశాలలో తలదాచుకునేవారమని 'గాసోలిన్' ఉపయోగించి అగ్ని రాజేసి ఉపాధ్యాయుల గదికి ముట్టించినట్లు వారు అంగీకరించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం