మహిళలకు బిగ్ అలర్ట్..
- March 16, 2025
మహిళలకు అలర్ట్.. పోస్ట్ ఆఫీస్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ (MSSC) పథకం త్వరలో ముగియనుంది. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇంకా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వం ఈ పథకంలో పెట్టుబడి సమయాన్ని పొడిగించలేదు.
పోస్ట్ ఆఫీస్ కింద నిర్వహించే ఈ పథకంలో మహిళలు పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ 31 మార్చి 2025గా నిర్ణయించింది. ఈ పథకంలో ఇంకా పెట్టుబడి పెట్టని మహిళలకు మార్చి 2025 వరకు సమయం ఉంది. ఆ తర్వాత ఈ స్కీమ్ క్లోజ్ చేయొచ్చు లేదా ప్రభుత్వం పొడిగించవచ్చు.
మహిళలకు ఈ స్కీమ్ బెస్ట్:
భారత ప్రభుత్వం మార్చి 31, 2023న స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా మహిళలు, బాలికల కోసం MSSC (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం రెండు సంవత్సరాల కాలానికి అందుబాటులో ఉంటుంది. మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించడం, వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద 2 ఏళ్ల మెచ్యూరిటీ వ్యవధి కూడా అందిస్తోంది.
ఎంత వడ్డీ వస్తుందంటే?
దేశంలోని ఏ మహిళ అయినా ఈ పథకంలో 2 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద భారీ వడ్డీ కూడా అందిస్తుంది. MSSC పథకంపై 7.5శాతం వార్షిక వడ్డీ అందిస్తుంది. బ్యాంకుల 2 ఏళ్ల FD కన్నా ఎక్కువ. ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. మీ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ లేదా రిజిస్టర్డ్ బ్యాంకులలో సులభంగా ఓపెన్ చేయొచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? :
ఈ పథకం కింద భారత్లో నివసించే ఏ మహిళ అయినా కనీసం రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 ఏళ్ల వ్యవధి తర్వాత మొత్తం అసలు, వడ్డీ తిరిగి చెల్లిస్తుంది. ఒక ఏడాది తర్వాత ఖాతాదారుడు మొత్తంలో 40శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు.
మహిళా సమ్మాన్ యోజన రూల్స్:
తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారుడి మరణం వంటి పరిస్థితులలో అకౌంట్ ముందస్తుగా క్లోజ్ చేయొచ్చు. అయితే, ఖాతాదారుడు 6 నెలల తర్వాత ఖాతాను క్లోజ్ చేస్తే వడ్డీ రేటు తగ్గుతుంది.
మార్చి 31 వరకు పెట్టుబడి పెట్టవచ్చు:
ప్రభుత్వం అందించే (MSSC) స్కీమ్ ఎలాంటి పొడిగింపును ప్రకటించలేదు. అందుకే మార్చి 31, 2025 లోగా పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అధిక వడ్డీ రేటుతో మహిళలకు అద్భుతమైన పెట్టుబడి ఆప్షన్ అని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







