మతం కాపాడలేకపోయినా, ఖురాన్ కాపాడుతుంది..
- July 05, 2016
ఏ అంశం అయినా తనదైన శైలిలో స్పందించే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఢాకా కాల్పులపై పేలాడు. ఢాకా కాల్పుల తర్వాత అన్ని స్కూళ్లలో ఖురాన్ చదివించడం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తోందంటూ వర్మ ట్వీట్ చేశాడు. రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు ఢాకాలో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే.
దానిపై మంగళవారం వర్మ స్పందిస్తూ.. ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడానికి అన్ని స్కూళ్లలో ఖురాన్ చదివించడం ఒక్కటే దారి అన్నాడు. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవాలంటే ఖురాన్ నేర్చుకోవాల్సిందేనని, వారిని వారి మతం కాపాడలేకపోయినా, ఖురాన్ కాపాడుతుందని ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









