అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' నుండి పవర్ ఫుల్ టీజర్

- March 17, 2025 , by Maagulf
అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి\' నుండి పవర్ ఫుల్ టీజర్

విజయశాంతి కొన్నాళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో మళ్ళీ రానుంది. అప్పట్లో విజయశాంతి అంటే కమర్షియల్ సినిమాలతో పాటు పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కూడా మళ్ళీ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతుంది.

తాజాగా నేడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ రిలీజ్ చేసారు. టీజర్లో విజయశాంతి పోలీస్ పాత్రలో అదరగొట్టారు. టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించగా కళ్యాణ్ రామ్ రామ్, విజయశాంతితో పాటు మూవీ యూనిట్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయం తెలిపారు.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. సినిమా రిలీజయి బ్లాక్ బస్టర్ అయ్యాక చేపల పులుసు చేసి ఇస్తాను అని చెప్పాను. ఈ సినిమా మొదలయినప్పుడు అమ్మ(విజయశాంతి) ఒక మొక్కు మొక్కుకుంది. రిలీజయ్యాక తిరుమల వెళ్లి కాలినడకన వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటాము. అప్పటి వరకు నాన్ వెజ్ తినను అని మొక్కుకున్నారు. అది అయ్యాక అమ్మకి నేనే చేపల పులుసు చేసి పెడతాను అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com