ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ సెర్మనీ..
- March 17, 2025
కోల్కతా: మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం కానుంది. మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ సీజన్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు అన్ని జట్లు సైతం ఇప్పటికే ప్రాక్టీస్ను మొదలుపెట్టాయి. ఈ సీజన్లో టైటిల్ విజేతగా నిలవాలని ఆరాటపడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకలో బాలీవుడ్ నటీనటుల డాన్సులు, పాటలతో స్టేడియాన్ని ఊర్రూతలూగించనున్నట్లు సమాచారం.
శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ డ్యాన్స్ చేయనున్నారట. ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీలో హీట్ పుట్టించే ఈ జంట.. ఐపీఎల్ నైట్లో ఉర్రూతలూగిస్తారని భావిస్తున్నారు. వీరికి తోడు పాపులర్ సింగర్ అరిజిత్ సింగ్, శ్రేయ ఘోషాల్ తన పాటలతో యూత్ను మైమరపింపజేస్తారని చెబుతున్నారు. వీరే కాకుండా పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







