ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ సెర్మనీ..
- March 17, 2025
కోల్కతా: మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం కానుంది. మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ సీజన్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు అన్ని జట్లు సైతం ఇప్పటికే ప్రాక్టీస్ను మొదలుపెట్టాయి. ఈ సీజన్లో టైటిల్ విజేతగా నిలవాలని ఆరాటపడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకలో బాలీవుడ్ నటీనటుల డాన్సులు, పాటలతో స్టేడియాన్ని ఊర్రూతలూగించనున్నట్లు సమాచారం.
శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ డ్యాన్స్ చేయనున్నారట. ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీలో హీట్ పుట్టించే ఈ జంట.. ఐపీఎల్ నైట్లో ఉర్రూతలూగిస్తారని భావిస్తున్నారు. వీరికి తోడు పాపులర్ సింగర్ అరిజిత్ సింగ్, శ్రేయ ఘోషాల్ తన పాటలతో యూత్ను మైమరపింపజేస్తారని చెబుతున్నారు. వీరే కాకుండా పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









