రోజూ పళ్లు ఎలా తోముకోవాలి? ఎంత సేపు తోముకుంటే సరిపోతుంది?

- March 19, 2025 , by Maagulf
రోజూ పళ్లు ఎలా తోముకోవాలి? ఎంత సేపు తోముకుంటే సరిపోతుంది?

ముఖ సౌందర్యంలో దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. దంతాలు తెల్లగా మెరిసిపోతే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెరిసే దంతాలు మన వ్యక్తిత్వానికి అందాన్ని ఇస్తాయి. అందుకే చాలా మంది దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోవాలని చాలా మంది కోరుకుంటారు. దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి చాలా మంది రకరకాల పద్ధతుల్ని ఫాలో అవుతుంటారు. 

కొంతమంది ఉదయం వేప పుల్లతో పళ్ళు తోముకోవడానికి ఇష్టపడతారు. అయితే చాలా మంది పళ్ళు శుభ్రం చేసుకోవడానికి టూత్‌పేస్ట్‌, బ్రష్ ఉపయోగిస్తుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలా మంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలా బ్రష్ చేయాలి, ఎంత సేపు చేయాలన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

1970లలో దంతవైద్యులు రెండు నిమిషాల పాటు బ్రషింగ్ చేయాలిని సిఫార్సు చేశారు. ఆ తరువాత మృదువైన టూత్ బ్రష్‌ను ఉపయోగించమని చెప్పారు. రెండు నిమిషాలు బ్రష్ చేయడం వల్ల దంతాల నుంచి మురికి మెరుగైన రీతిలో తొలగిపోతుందని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల ఎక్కువ మురికి తొలగిపోతుంది. కానీ రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల దంతాలు దీర్ఘకాలికంగా బలంగా ఉంటాయో లేదో నిర్ధారించడానికి తగినంత పరిశోధనలు జరగలేదు. 

మనం పళ్ళు తోముకునేటప్పుడు దంతాల ఉపరితలాల నుంచి క్రిములను (డెంటల్ ప్లేక్ అని పిలుస్తారు) తొలగించడమే లక్ష్యంగా బ్రష్ చేసుకుంటాం. డెంటల్ ఫ్లేక్ అనేది సూక్ష్మజీవుల బయోఫిల్మ్ అని పిలువబడే ఒక సమాజంలో కలిసి జీవించే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌ల సమూహం. బయోఫిల్మ్‌లు చాలా జిగటగా ఉంటాయి. బ్రష్ చేస్తేనే ఈ బయోఫిల్మ్‌లు సరిగ్గా క్లీన్ అవుతాయి. 

అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయాలి. బ్రష్ చేయడం వల్ల దంతాలపై పేరుకుపోయిన ఫ్లేక్ తొలగిపోతుంది. ఫ్లేక్ దంతాల ఎనామిల్‌పై దాడి చేస్తుంది. ఇది చాలా కాలం పాటు జరిగితే, పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. దీంతో కావిటీస్ ఏర్పడతాయి. అందుకే దంతాలు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. 

పెద్దలందరూ రోజుకు రెండుసార్లు, ప్రతిసారీ కనీసం 2 నిమిషాలు బ్రష్ చేయాలి. మీరు 2×2 సూత్రాన్ని పాటిస్తే, దంతాలు చాలా కాలం పాటు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఏదైనా ఆమ్ల ఆహారం లేదా పానీయాలు తీసుకున్నట్టయితే వెంటనే బ్రష్ చేయకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ దంతాలు బలహీనంగా మారతాయి. 

ప్రస్తుత నిపుణుల అధ్యయనాల ఆధారంగా, ప్రతిసారీ నాలుగు నిమిషాలు బ్రష్ చేయడం వల్ల మీ దంతాలకు ఉత్తమమైన శుభ్రత లభిస్తుందని సిఫార్సు చేయబడింది. కానీ రోజుకు రెండుసార్లు కంటే ఎక్కువ బ్రష్ చేయవద్దు. అంతేకాకుండా బ్రష్ కూడా హార్డ్‌గా ఉండకూడదు. పళ్లు తోముకునేటప్పుడు హారిజాంటల్‌గా బ్రష్ చేయవద్దు. వర్టికల్‌గా, బ్రష్ 45 డిగ్రీల్లో ఉండేలా పళ్లు తోముకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా బలంగా పళ్లు తోమకండి. ఇలా చేయడం వల్ల చిగుళ్ల దెబ్బతినే ప్రమాదముంది. ఫ్లాసింగ్ ద్వారా కూడా దంతాల్ని క్లీన్ చేసుకోవచ్చంటున్నారు. 

* క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకుంటూ ఉండండి.

* ఏదైనా ఆహారం తిన్న తర్వాత నోటిని పుక్కిలించడం అలవాటు చేసుకోండి

* బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ వాడండి.

* ఆహారపు అలవాట్లు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ వంటివి తినడం మానుకోండి

* ఎక్కువ సీట్లు తినకండి. అంతేకాకుండా షుగరీ డ్రింక్స్ కూడా అతిగా వద్దు.

* ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు మీ టూత్ బ్రష్ మార్చండి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com