దుబాయ్ సర్జన్ క్రెడిట్ కార్డ్ హ్యాక్..Dh120,000 ఖాళీ..!!
- March 19, 2025
యూఏఈ: దుబాయ్కు చెందిన ఒక ఆసియా డాక్టర్ శస్త్రచికిత్స చేస్తుండగా తన క్రెడిట్ కార్డ్ ఉపయోగించి Dh120,000 కంటే ఎక్కువ విలువైన 14 అనధికార లావాదేవీలు చేశారని తెలుసుకుని షాక్కు గురయ్యారు. ఒక అంతర్జాతీయ బ్యాంకుకు చెందిన ప్రముఖ కస్టమర్ అయిన డాక్టర్ అనితా సింగ్ (పేరు మార్చాము) తన క్రెడిట్ కార్డ్ ఎల్లప్పుడూ తన వద్దే ఉంటుందని, ఏ మొబైల్ పరికరంలోనూ డిజిటలైజ్ చేయబడలేదని చెప్పారు. అయినప్పటికీ, ఏడు గంటలకు పైగా, దుబాయ్ మాల్లోని ప్రధాన ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు.. షార్జాలోని దుకాణాలతో సహా వివిధ ప్రదేశాలలో లావాదేవీలు జరిగాయి. వీటిలో చాలా వరకు Dh10,000 కంటే ఎక్కువ అని తెలిపారు. “ఈ లావాదేవీలు జరిగినప్పుడు నేను ఆపరేషన్ మధ్యలో ఉన్నాను” అని అన్నారు. “నా కార్డు పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా వాటిలో లావాదేవీలు నాలుగు జరిగాయి. రెండు కువైట్ దినార్లలో (KWD) ఉన్నాయి. వాటిలో దేనికీ OTP అవసరం లేదు.” అని పేర్కొన్నారు. అనుమానాస్పద లావాదేవీలు అని బ్యాంకు గుర్తించినా, వారు కార్డును బ్లాక్ చేయలేదు?" అని బ్యాంకును ప్రశ్నించారు. బ్యాంకుకు సమాచారం అందజేసినా వెంటనే బ్లాక్ చేయకపోవడంతో ఆ తర్వాత కూడా లావాదేవీలు పోస్ట్ చేయబడ్డాయని తెలిపారు.
డాక్టర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో, మోసపూరిత ఛార్జీలను తిరిగి చెల్లించడానికి బ్యాంక్ 12 నెలల వాయిదాల ఆఫర్ ను అందించింది. కానీ, ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.
ఇలాంటి కేసులు గతంలోనూ జరిగాయి. అజోయ్ జోసెఫ్ అనే భారతీయుడు తన పేరు మీద నకిలీ ఎమిరేట్స్ ఐడి ఫోటోకాపీని ఉపయోగించి మూడు క్రెడిట్ కార్డులు మోసపూరితంగా జారీ చేయబడ్డాయని గుర్తించాడు. ఒక్కొక్కటి గరిష్టంగా 30,000 దిర్హామ్ల వరకు ఉంది. మరో బాధితురాలు ఆయేషా నసీమ్ తన క్రెడిట్ కార్డును ఖతార్లో ఉపయోగించారని, ఆమె ఎప్పుడూ యూఏఈని విడిచి వెళ్లలేదు. దుబాయ్ గృహిణి సరికా థడానీ తన కార్డును బ్లాక్ చేసిన తర్వాత కూడా లావాదేవీలకు ఛార్జీ విధించినట్లు తెలిపింది. అయితే డ్రైవర్ అయిన అబ్దుల్ ఖాదర్ తన బ్యాంక్ ఖాతాను ఎటువంటి OTP ధృవీకరణ లేకుండా ఖాళీ చేశాడని విచారణలో తేలింది.
యూఏఈలో ఇటువంటి మోసం కేసులు పెరుగుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు సగటున 50,000 బెదిరింపులను ఎదుర్కొంటున్నాయని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. "యూఏఈలోని బ్యాంకులు తమ కస్టమర్లను రక్షించాల్సిన బాధ్యత ఉంది" అని దుబాయ్కు చెందిన HZ లీగల్లో లీగల్ కన్సల్టెంట్ హోసం జకారియా అన్నారు. ఆర్థిక మోసానికి గురైన బాధితులు తమ హక్కులను అర్థం చేసుకోవడానికి, పరిహారం కోసం చట్ట పరిధిలో ఉన్న మార్గాలపై న్యాయ సలహా తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







