ఇండియన్ ఎంబసీలో రమదాన్ సెలబ్రేషన్స్..వెల్లివిరిసిన సోదరభావం..!!
- March 19, 2025
కువైట్: దౌత్య సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడానికి కువైట్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సాయంత్రం రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా నేతృత్వంలో ప్రత్యేక రమదాన్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కువైట్ రాజకుటుంబ సభ్యులు, మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, రాయబారులు, దౌత్య కార్యకలాపాల అధిపతులు సహా గౌరవనీయ అతిథులు హాజరయ్యారు. హాజరైన వారిలో కువైట్ చమురు మంత్రి తారిక్ అల్-రౌమి, ఫర్వానియా గవర్నర్ షేక్ ధాబీ నాసర్ అల్-సబా, అమిరి దివాన్ సలహాదారు, రక్షణ అండర్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
విభిన్న మతాలు, సంస్కృతుల భూమి అయిన భారతదేశంలో రమదాన్ లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాకు నిలయంగా ఉంది ఇండియా. మరోవైపు కువైట్లో ఇండియన్ కమ్యూనిటీ రమదాన్ సందర్భంగా ఇఫ్తార్లు, గబ్కాను నిర్వహించే సంప్రదాయాన్ని పాటిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









