ఇండియన్ ఎంబసీలో రమదాన్ సెలబ్రేషన్స్..వెల్లివిరిసిన సోదరభావం..!!
- March 19, 2025
కువైట్: దౌత్య సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడానికి కువైట్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సాయంత్రం రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా నేతృత్వంలో ప్రత్యేక రమదాన్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కువైట్ రాజకుటుంబ సభ్యులు, మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, రాయబారులు, దౌత్య కార్యకలాపాల అధిపతులు సహా గౌరవనీయ అతిథులు హాజరయ్యారు. హాజరైన వారిలో కువైట్ చమురు మంత్రి తారిక్ అల్-రౌమి, ఫర్వానియా గవర్నర్ షేక్ ధాబీ నాసర్ అల్-సబా, అమిరి దివాన్ సలహాదారు, రక్షణ అండర్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
విభిన్న మతాలు, సంస్కృతుల భూమి అయిన భారతదేశంలో రమదాన్ లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాకు నిలయంగా ఉంది ఇండియా. మరోవైపు కువైట్లో ఇండియన్ కమ్యూనిటీ రమదాన్ సందర్భంగా ఇఫ్తార్లు, గబ్కాను నిర్వహించే సంప్రదాయాన్ని పాటిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







