ఇండియన్ ఎంబసీలో రమదాన్ సెలబ్రేషన్స్..వెల్లివిరిసిన సోదరభావం..!!
- March 19, 2025
కువైట్: దౌత్య సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడానికి కువైట్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సాయంత్రం రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా నేతృత్వంలో ప్రత్యేక రమదాన్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కువైట్ రాజకుటుంబ సభ్యులు, మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, రాయబారులు, దౌత్య కార్యకలాపాల అధిపతులు సహా గౌరవనీయ అతిథులు హాజరయ్యారు. హాజరైన వారిలో కువైట్ చమురు మంత్రి తారిక్ అల్-రౌమి, ఫర్వానియా గవర్నర్ షేక్ ధాబీ నాసర్ అల్-సబా, అమిరి దివాన్ సలహాదారు, రక్షణ అండర్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
విభిన్న మతాలు, సంస్కృతుల భూమి అయిన భారతదేశంలో రమదాన్ లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాకు నిలయంగా ఉంది ఇండియా. మరోవైపు కువైట్లో ఇండియన్ కమ్యూనిటీ రమదాన్ సందర్భంగా ఇఫ్తార్లు, గబ్కాను నిర్వహించే సంప్రదాయాన్ని పాటిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









