ఇండియన్ ఎంబసీలో రమదాన్ సెలబ్రేషన్స్..వెల్లివిరిసిన సోదరభావం..!!
- March 19, 2025
కువైట్: దౌత్య సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడానికి కువైట్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సాయంత్రం రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా నేతృత్వంలో ప్రత్యేక రమదాన్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కువైట్ రాజకుటుంబ సభ్యులు, మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, రాయబారులు, దౌత్య కార్యకలాపాల అధిపతులు సహా గౌరవనీయ అతిథులు హాజరయ్యారు. హాజరైన వారిలో కువైట్ చమురు మంత్రి తారిక్ అల్-రౌమి, ఫర్వానియా గవర్నర్ షేక్ ధాబీ నాసర్ అల్-సబా, అమిరి దివాన్ సలహాదారు, రక్షణ అండర్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
విభిన్న మతాలు, సంస్కృతుల భూమి అయిన భారతదేశంలో రమదాన్ లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాకు నిలయంగా ఉంది ఇండియా. మరోవైపు కువైట్లో ఇండియన్ కమ్యూనిటీ రమదాన్ సందర్భంగా ఇఫ్తార్లు, గబ్కాను నిర్వహించే సంప్రదాయాన్ని పాటిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







