ఇండియన్ ఎంబసీలో రమదాన్ సెలబ్రేషన్స్..వెల్లివిరిసిన సోదరభావం..!!
- March 19, 2025
కువైట్: దౌత్య సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడానికి కువైట్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సాయంత్రం రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా నేతృత్వంలో ప్రత్యేక రమదాన్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కువైట్ రాజకుటుంబ సభ్యులు, మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, రాయబారులు, దౌత్య కార్యకలాపాల అధిపతులు సహా గౌరవనీయ అతిథులు హాజరయ్యారు. హాజరైన వారిలో కువైట్ చమురు మంత్రి తారిక్ అల్-రౌమి, ఫర్వానియా గవర్నర్ షేక్ ధాబీ నాసర్ అల్-సబా, అమిరి దివాన్ సలహాదారు, రక్షణ అండర్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
విభిన్న మతాలు, సంస్కృతుల భూమి అయిన భారతదేశంలో రమదాన్ లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాకు నిలయంగా ఉంది ఇండియా. మరోవైపు కువైట్లో ఇండియన్ కమ్యూనిటీ రమదాన్ సందర్భంగా ఇఫ్తార్లు, గబ్కాను నిర్వహించే సంప్రదాయాన్ని పాటిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి