ఎండలకి ఫ్రిజ్ నీరు బదులు కుండ నీటితో కలిగే లాభాలు...!
- March 21, 2025
ఫ్రిజ్లో అంతగా చల్లగా ఉండవు. కానీ, ఈ నీరు తాగితే ఉన్నంత తృప్తి ఫ్రిజ్ నీరు తాగితే రాదు. దీనిని తాగడం వల్ల జీవక్రియ, జీర్ణక్రియ పుష్కలంగా పెరుగుతుంది. మట్టిలో ఖనిజాలు నీటిలో పోషకాలను నింపుతాయి. ఇవి జీర్ణక్రియకి సాయపడతాయి. ఆహారం నుండి పోషకాలను గ్రహించేందుకు హెల్ప్ చేస్తాయి. మట్టి కుండలో నీరు తాగడం పురాతన సంప్రదాయం. దీని వల్ల ఎన్నో ఎన్నెన్నో లాభాలు కూడా ఉన్నాయి.
నీటిని సహజంగానే చల్లగా ఉంచి నీటి రుచిని పెంచి ఆరోగ్యాన్ని అందించడం వరకూ మట్టి కుండలు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. మట్టికుండల్ని ఎందుకు వాడాలి. వాడడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి. మట్టికుండని వాడితే సహజంగానే నీరు చల్లగా మారుతుంది. మట్టి కుండలు రంధ్రాల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇది నీరు నెమ్మదిగా గోడల గుండా వెళ్లి ఉపరితలంపై ఆవిరైపోయేలా చేస్తుంది.
బాష్పీభవన శీతలీకరణ అని పిలిచే ఈ ప్రక్రియ కుండలోపల నీటిని ఆహ్లాదకరమైన చల్లని ఉష్ణోగ్రత వద్ద ఉంచుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో. ఎక్కువగా చల్లగా ఉండి గొంతులో అసౌకర్యాన్ని కలిగించే ఫ్రిజ్ నీటిలా కాకుండా మట్టి కుండలోని నీరు సహజంగానే పరిపూర్ణమైన, రీఫ్రెషింగ్ టెంపరేచర్కి చల్లబడుతుంది.
బంకమట్టి క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. మట్టి కుండలో నీటిని నిల్వ చేసినప్పుడు అది మట్టిలోని ఖనిజాలతో సంకర్షణ చెందుతుంది. ఈ పరస్పర చర్య నీటి pH లెవల్స్ని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. బంకమట్టి యొక్క క్షార స్వభావం నీటిలోని ఆమ్లతని తటస్థీకరిస్తుంది. ఇది శరీరానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆల్కలీన్ నీటిని తాగితే బాడీలో pH లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. మెరుగైన జీవక్రియ, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.
మట్టి కుండలోని నీరి రుతాగితే జీవక్రియ, జీర్ణక్రియ గణనీయంగా పెరుగుతుంది. బంకమట్టిలోని ఖనిజాలు జీర్ణక్రియకి సాయపడే పోషకాలతో నీటిలో నింపుతాయి. ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది మెరుగైన జీవక్రియ, మెరుగైన పేగు ఆరోగ్యానికి దారి తీస్తుంది. అంతేకాకుండా, చల్లని క్షార నీరు జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సాయపడుతుంది. ఆమ్లత్వం, ఉబ్బరం తగ్గుతుంది.
నీటిని నిల్వ చేయడానికి మట్టి కుండని వాడడం చాలా మంచిది. ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర మెటల్స్ కాకుండా మట్టి కుండలు పర్యావరణానికి హాని కలిగించని సహజమైన బయోడిగ్రేడబుల్ పదార్థాలతో తయారుచేయబడతాయి. మట్టి కుండని ఎంచుకుంటే ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిళ్ల తయారీ, పారవేయడంతో సంబంధం ఉన్న పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అదనంగా, మట్టి కుండలను వాడడం వల్ల కుండలు చేసే చేతి వృత్తుల వారికి హెల్ప్ చేసిన వారవుతాం.
మట్టికుండలోని నీరు మంచి రుచిని కలిగి ఉంటుంది. చాలా మంది ప్లాస్టిక్, ఇతర మెటల్లో ఉంచిన నీటిని ఇష్టపడతారు. కానీ, మట్టి కుండలో జరిగే సహజ వడపోత కారణంగా మలినాలు తొలగిపోతాయి. నీటికి తేలికపాటి మట్టి రుచి వస్తుంది. ఇది తాగే నీటిని మరింత రుచిగా చేసి హైడ్రేటెడ్గా ఉంచుతాయి.
మట్టి కుండల్లో నీటిని నిల్వ చేయడం రసాయన రహితంగా ఉంటాయి. ప్లాస్టిక్ కంటైనర్స్ నీటిలోకి రసాయనాలు విడుదలవుతాయి. ముఖ్యంగా ఎండలో ఉన్నప్పుడు రోజులు గడిచేకొద్దీ ఈ నీటిని తీసుకుంటే ఆరోగ్య సమస్యలొస్తాయి. దీనికి బదులు మట్టి కుండలో నీరు తాగడం చాలా మంచిది.
మట్టి కుండ సహజ వడపోతగా పనిచేస్తుంది. నీటిలోని మలినాలని, టాక్సిన్స్ని దూరం చేస్తుంది. ఈ సహజ డీటాక్సీఫికేషన్ మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడానికి సురక్షితంగా ఉందని నిర్ధారిస్తుంది. ఈ నీటిని రెగ్యులర్గా తాగితే కలుషితాలను తగ్గించినవారవుతాం. దీంతో ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది కూడా. బరువు తగ్గడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









