ఇఫ్తార్ సమయంలో ప్రమాదం..ముగ్గురు టీనేజర్లు మృతి..!!
- March 21, 2025
యూఏఈ: యూఏఈలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు ఎమిరాటీ యువకుల మరణించారు. ఈ ఘటన మరోసారి మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలపై చర్చను ప్రారంభించింది. ఇఫ్తార్ సమయంలో షార్జాలోని కల్బా రోడ్డులో జరిగిన ఈ ప్రమాదం, వాహనంపై నియంత్రణ కోల్పోయిన మైనర్ డ్రైవర్ వల్ల జరిగిందని, ఫలితంగా ప్రాణాంతక ప్రమాదం జరిగిందని పోలీసులు నివేదించారు. లైసెన్స్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేయడంతో ముడిపడి ఉన్న ఈ ఘటన అందరిని ఆలోచింపజేస్తుంది.
మైనర్ డ్రైవింగ్ పై అధికారులు గతంలోనూ హెచ్చరించారు. యువ టీనేజర్లు తమ తల్లిదండ్రుల వాహనాలను అనుమతి లేకుండా, తరచుగా తోటివారి ఒత్తిడి ప్రభావంతో నడుపుతున్నారని తెలుస్తుంది. కొంతమందికి ఇది గర్వకారణం, స్నేహితులను ఆకట్టుకోవడానికి ఒక మార్గంగా చేసుకుంటారని తెలిపారు.
మార్చి 29 నుండి అమలులోకి రానున్న ట్రాఫిక్ రెగ్యులేషన్పై 2024 నాటి ఫెడరల్ డిక్రీ-లా నంబర్ (14) ప్రకారం, కార్లు..తేలికపాటి వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస వయస్సును 18 నుండి 17 సంవత్సరాలకు తగ్గించడంతో సహా మార్పులను ప్రవేశపెడుతుంది. ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసే వారిని అరెస్టులు చేసేందుకు అకొత్త చట్టం అనుమతిస్తుందన్నారు. తక్కువ వయస్సు గలవారు వాహనం నడపడం వల్ల కలిగే చట్టపరమైన ప్రమాదాలు, ప్రాణాంతక పరిణామాల గురించి విద్యార్థులను బాగా అర్థం చేసుకోవడానికి సన్నద్ధం చేయాలని నిపుణులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









