ఇఫ్తార్ సమయంలో ప్రమాదం..ముగ్గురు టీనేజర్లు మృతి..!!
- March 21, 2025
యూఏఈ: యూఏఈలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు ఎమిరాటీ యువకుల మరణించారు. ఈ ఘటన మరోసారి మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలపై చర్చను ప్రారంభించింది. ఇఫ్తార్ సమయంలో షార్జాలోని కల్బా రోడ్డులో జరిగిన ఈ ప్రమాదం, వాహనంపై నియంత్రణ కోల్పోయిన మైనర్ డ్రైవర్ వల్ల జరిగిందని, ఫలితంగా ప్రాణాంతక ప్రమాదం జరిగిందని పోలీసులు నివేదించారు. లైసెన్స్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేయడంతో ముడిపడి ఉన్న ఈ ఘటన అందరిని ఆలోచింపజేస్తుంది.
మైనర్ డ్రైవింగ్ పై అధికారులు గతంలోనూ హెచ్చరించారు. యువ టీనేజర్లు తమ తల్లిదండ్రుల వాహనాలను అనుమతి లేకుండా, తరచుగా తోటివారి ఒత్తిడి ప్రభావంతో నడుపుతున్నారని తెలుస్తుంది. కొంతమందికి ఇది గర్వకారణం, స్నేహితులను ఆకట్టుకోవడానికి ఒక మార్గంగా చేసుకుంటారని తెలిపారు.
మార్చి 29 నుండి అమలులోకి రానున్న ట్రాఫిక్ రెగ్యులేషన్పై 2024 నాటి ఫెడరల్ డిక్రీ-లా నంబర్ (14) ప్రకారం, కార్లు..తేలికపాటి వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస వయస్సును 18 నుండి 17 సంవత్సరాలకు తగ్గించడంతో సహా మార్పులను ప్రవేశపెడుతుంది. ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసే వారిని అరెస్టులు చేసేందుకు అకొత్త చట్టం అనుమతిస్తుందన్నారు. తక్కువ వయస్సు గలవారు వాహనం నడపడం వల్ల కలిగే చట్టపరమైన ప్రమాదాలు, ప్రాణాంతక పరిణామాల గురించి విద్యార్థులను బాగా అర్థం చేసుకోవడానికి సన్నద్ధం చేయాలని నిపుణులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- రియాద్లో జాయ్ ఫోరం 2025..SR4 బిలియన్ ఒప్పందాలు..!!
- ఫ్లైట్ లో లిథియం బ్యాటరీ పేలుడు..ప్రయాణికులు షాక్..!!
- ఒమన్ లో వైభవంగా దీపావళి వేడుకలు..!!
- బహ్రెయిన్ పోస్ట్ మొబైల్ పోస్టల్ సేవలు ప్రారంభం..!!
- కెపిటల్ గవర్నరేట్లో భద్రత, ట్రాఫిక్ క్యాంపెయిన్..!!
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!