బహ్రెయిన్లో యూరోపియన్ ఇన్వెస్టర్ కు జైలుశిక్ష..!!
- March 22, 2025
మనామా: బహ్రెయిన్లో మనీ లాండరింగ్ స్కీమ్ మోసాలు బయటికొచ్చాయి. ఇందులో ఒక యూరోపియన్ పెట్టుబడిదారుడితోపాటు అనేక మంది ఉన్నారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులను మోసపూరిత ఆపరేషన్లో పెట్టుబడి పెట్టేలా ప్రచారం నిర్వహించి మోసగించారని పేర్కొన్నారు. నిందితుడు దాదాపు 181 మంది బాధితులను మోసం చేశాడని తెలిపారు. ముఠా సభ్యులు 3 మిలియన్లకు పైగా బహ్రెయిన్ దినార్లను సేకరించినట్టు గుర్తించారు. కేసును విచారించిన బహ్రెయిన్ ఫస్ట్ క్రిమినల్ కోర్టు కేసులో ఉన్న రెండవ నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. అంతకుముందు, కోర్టు పరారీలో ఉన్న యూరోపియన్ పెట్టుబడిదారుడికి ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష, 100,000 దినార్ల జరిమానా విధించింది. నేరం ద్వారా వచ్చిన సొమ్మును జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. 3,371,250 దినార్లు, 600 ఫిల్స్ను నిజమైన యజమానులకు తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తీర్పును సవాలు చేసిన రెండవ ప్రతివాదికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించగా, మూడవ ప్రతివాది - ఇంకా పరారీలో ఉన్నాడని, కోర్టు అతడికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 100,000 దినార్లు జరిమానా విధించదని తెలిపారు. నాల్గవ నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు 5,000 దినార్లు జరిమానా విధించారు. నకిలీ ఇన్వాయిస్లు, కొనుగోలు ఆర్డర్లను ఉపయోగించి 3 మిలియన్లకు పైగా దినార్లను సేకరించి బ్యాంకుల నుండి తన కార్యకలాపాలను నిందితులు నిర్వహించారని తెలిపారు. యూరోపియన్ మనీలాండరింగ్ సంబంధించి పలు దేశాలలో నేర చరిత్ర ఉందని విచారణలో గుర్తించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అతడు 2022లో బహ్రెయిన్కు వచ్చాడనీ, ప్రముఖ అథ్లెట్ల నుండి సంతకం చేసిన స్పోర్ట్స్ జెర్సీలు, జ్ఞాపికలు, విలువైన వస్తువులను విక్రయించడానికి ఒక డిజిటల్ కంపెనీని ఏర్పాటు చేశాడనీ దర్యాప్తులో వెల్లడైంది. అతను 44 కార్యాలయాలను అద్దెకు తీసుకున్నాడని, ట్టుబడిదారులను ఆకర్షించడానికి పెద్ద సేల్స్ టీమ్ ను నియమించుకొని, 22శాతం లాభాల పేరిట మోసాలకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- వీసా ఫీజులను పెంచిన జపాన్ ..భారతీయుల పై పడనున్న భారం!
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!







