నకిలీ వస్తువులను అమ్ముతున్న 375 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్ట్..!!
- March 23, 2025
యూఏఈ: రమదాన్ మాసం పురస్కరించుకొని బహిరంగ ప్రదేశాల్లో ఆహార పదార్థాలు, నకిలీ వస్తువులను అక్రమంగా అమ్ముతున్నందుకు 375 మంది వీధి వ్యాపారులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. లైసెన్స్ లేని విక్రేతల నుండి కొనుగోలు చేయవద్దని నివాసితులను ఈ సందర్భంగా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉత్పత్తులను రవాణా చేయడానికి, విక్రయించడానికి ఉపయోగించే అనేక వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
యాంటీ-స్ట్రీట్ వెండింగ్ విభాగం అధిపతి లెఫ్టినెంట్ కల్నల్ తాలిబ్ అల్ అమిరి మాట్లాడుతూ.. లైసెన్స్ లేని విక్రేతలు లేదా రోడ్డు పక్కన ఉన్న వాహనాల నుండి వస్తువులను.. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. ప్రజలు తమ భద్రత, శ్రేయస్సును నిర్ధారించుకోవడానికి ఆహార కొనుగోళ్ల కోసం లైసెన్స్ పొందిన సంస్థలను మాత్రమే ఆశ్రయించాలని ఆయన కోరారు. ఈ వస్తువులు సరైన నిర్వహణ, నిల్వ లేకపోవడం వల్ల ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమవుతాయని, దీనివల్ల వినియోగదారులు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు గురవుతారని అని దుబాయ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







