యూఏఈలో 5 బ్యాంకులు, 2 బీమా కంపెనీలకు Dh2.62 మిలియన్లు ఫైన్..!!
- March 26, 2025
యూఏఈ: యూఏఈలో పనిచేస్తున్న ఐదు బ్యాంకులు, రెండు బీమా కంపెనీలకు పన్ను నిబంధనలను పాటించనందుకు జరిమానా విధించినట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) ప్రకటించింది. కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (CRS), ఫారిన్ అకౌంట్ టాక్స్ కంప్లైయన్స్ యాక్ట్ (FATCA) మార్గదర్శకాల ప్రకారం.. అవసరమైన ట్యాక్స్ విధానాలను నివేదించడంలో విఫలమైనందుకు బ్యాంకులు, బీమా కంపెనీలపై సెంట్రల్ బ్యాంక్ మొత్తం Dh2,621,000 ఆర్థిక ఆంక్షలు విధించింది.
CBUAE అన్ని లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థలకు సరిదిద్దడానికి తగినంత సమయం ఇచ్చినప్పటికీ, సంస్థలు ప్రమాణాలను పాటించడంలో విఫలమైనందున, ఆంక్షలు విధించినట్టు తెలిపింది. ఇలాంటి చర్యలు యూఏఈ ఆర్థిక వ్యవస్థ నాణ్యతను పెంచుతుందని, పన్ను వ్యవస్థల సమగ్రత పారదర్శకతను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని CBUAE వెల్లడించింది.
తాజా వార్తలు
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్









