సౌదీ అరేబియాలో డెంగ్యూ జ్వరంపై సర్వే..!!
- March 26, 2025
రియాద్: సౌదీ పబ్లిక్ హెల్త్ అథారిటీ (వెకాయా) మరో కార్యక్రమానికి తెరతీసింది. రాజ్యం అంతటా డెంగ్యూ జ్వరం ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని అధ్యయనం చేయడానికి విస్తృతమైన సర్వే ప్రాజెక్ట్ను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం 12 నెలల్లోపు పూర్తిచేయాలని నిర్ణయించబడింది. రాజ్యంలోని అన్ని ప్రాంతాలలో డెంగ్యూ జ్వరం ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని అధ్యయనం చేయడానికి దీర్ఘకాలిక, విస్తృతమైన సర్వే కార్యక్రమాన్ని అమలు చేయడానికి అధికారులు ప్రణాళికులు రూపొందించారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. డెంగ్యూ జ్వరం దోమల కాటు ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యంగా పేద పట్టణ ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తుంది. డెంగ్యూ తరచుగా లక్షణరహితంగా ఉంటుంది. సాధారణంగా సంక్రమణ తర్వాత 3 నుండి 14 రోజుల తర్వాత లక్షణాలు కన్పిస్తాయి. వీటిలో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు-కీళ్ల నొప్పులు , చర్మంపై దురద-దద్దుర్లు కన్పిస్తాయి. డెంగ్యూ జ్వరం ఏడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







