నాలుగు కొత్త స్క్రాచ్ కార్డ్ గేమ్లను ప్రారంభించిన యూఏఈ లాటరీ..!!
- March 26, 2025
యూఏఈ: నాలుగు కొత్త ఆన్లైన్ స్క్రాచ్ కార్డ్ గేమ్లను ప్రారంభించినట్లు యూఏఈ లాటరీ ప్రకటించింది. దీని ద్వారా పార్టిసిపెంట్స్ Dh1 మిలియన్ వరకు బహుమతులు గెలుచుకోవచ్చని తెలిపింది. కొత్త స్క్రాచ్ కార్డ్లు ప్రతి ప్లేయర్ కు అనుగుణంగా రూపొందించిన ఎంట్రీ పాయింట్లను కలిగి ఉంటాయని పేర్కొంది.
స్క్రాచ్ కార్డ్ ఎంపికలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
కరక్ కాష్ (Dh5 ఎంట్రీ - Dh50,000 వరకు గెలుచుకోండి)
ఫార్చ్యూన్ ఫెస్టివల్ (Dh10 ఎంట్రీ - Dh100,000 వరకు గెలుచుకోవచ్చు.)
గోల్డెన్ డైనాస్టీ (Dh20 ఎంట్రీ - Dh300,000 వరకు గెలుచుకోవచ్చు.)
మిషన్ మిలియన్ (Dh50 ఎంట్రీ - Dh1,000,000 వరకు గెలుచుకోవచ్చు.)
2024 చివరలో ప్రారంభమైన యూఏఈ లాటరీలో ఇప్పటివరకు 70 మందికి పైగా నివాసితులు Dh100,000 గెలుచుకున్నారు. ప్రస్తుతం, జాక్పాట్ గెలుచుకునే అవకాశం ఉందని, యూఏఈ లాటరీని నిర్వహిస్తున్న ది గేమ్లోని లాటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ బిషప్ వూస్లీ అన్నారు.
యూఏఈ లాటరీలో పాల్గొనేవారికి Dh100 నుండి Dh100 మిలియన్ల వరకు మొత్తాలను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. స్క్రాచ్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో Dh1 మిలియన్ గరిష్ట బహుమతిని అందిస్తారు. లాటరీ టిక్కెట్లను దాని వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ త్వరలో ఒక యాప్ను విడుదల చేస్తుందని బిషప్ ఇంతకు ముందు ప్రకటించారు. త్వరలో కన్వీనియన్స్ స్టోర్లు, ఫ్యూయల్ స్టేషన్ల వంటి రిటైల్ ప్రదేశాలలో టిక్కెట్లను విక్రయించాలని కూడా యోచిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!







