నాలుగు కొత్త స్క్రాచ్ కార్డ్ గేమ్లను ప్రారంభించిన యూఏఈ లాటరీ..!!
- March 26, 2025
యూఏఈ: నాలుగు కొత్త ఆన్లైన్ స్క్రాచ్ కార్డ్ గేమ్లను ప్రారంభించినట్లు యూఏఈ లాటరీ ప్రకటించింది. దీని ద్వారా పార్టిసిపెంట్స్ Dh1 మిలియన్ వరకు బహుమతులు గెలుచుకోవచ్చని తెలిపింది. కొత్త స్క్రాచ్ కార్డ్లు ప్రతి ప్లేయర్ కు అనుగుణంగా రూపొందించిన ఎంట్రీ పాయింట్లను కలిగి ఉంటాయని పేర్కొంది.
స్క్రాచ్ కార్డ్ ఎంపికలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
కరక్ కాష్ (Dh5 ఎంట్రీ - Dh50,000 వరకు గెలుచుకోండి)
ఫార్చ్యూన్ ఫెస్టివల్ (Dh10 ఎంట్రీ - Dh100,000 వరకు గెలుచుకోవచ్చు.)
గోల్డెన్ డైనాస్టీ (Dh20 ఎంట్రీ - Dh300,000 వరకు గెలుచుకోవచ్చు.)
మిషన్ మిలియన్ (Dh50 ఎంట్రీ - Dh1,000,000 వరకు గెలుచుకోవచ్చు.)
2024 చివరలో ప్రారంభమైన యూఏఈ లాటరీలో ఇప్పటివరకు 70 మందికి పైగా నివాసితులు Dh100,000 గెలుచుకున్నారు. ప్రస్తుతం, జాక్పాట్ గెలుచుకునే అవకాశం ఉందని, యూఏఈ లాటరీని నిర్వహిస్తున్న ది గేమ్లోని లాటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ బిషప్ వూస్లీ అన్నారు.
యూఏఈ లాటరీలో పాల్గొనేవారికి Dh100 నుండి Dh100 మిలియన్ల వరకు మొత్తాలను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. స్క్రాచ్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో Dh1 మిలియన్ గరిష్ట బహుమతిని అందిస్తారు. లాటరీ టిక్కెట్లను దాని వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ త్వరలో ఒక యాప్ను విడుదల చేస్తుందని బిషప్ ఇంతకు ముందు ప్రకటించారు. త్వరలో కన్వీనియన్స్ స్టోర్లు, ఫ్యూయల్ స్టేషన్ల వంటి రిటైల్ ప్రదేశాలలో టిక్కెట్లను విక్రయించాలని కూడా యోచిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









