పీక్ సీజన్లో ఎక్స్ టెర్నల్ ఆపరేటర్లకు.. ఒమన్ అనుమతి..!!
- March 30, 2025
మస్కట్: వేసవి, శీతాకాలం సమయంలో దోఫర్ గవర్నరేట్కు.. ముఖ్యంగా మస్కట్-సలాలా, సోహార్-సలాలా మార్గాల్లో దేశీయ విమానాలను నడపడానికి ఒమన్ పౌర విమానయాన అథారిటీ (CAA) ఎక్స్ టెర్నల్ కంపెనీలను అనుమతిని జారీ చేసింది.
పీక్ సీజన్లలో అవసరమైన సేవలు అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, చార్టర్ ఆపరేటర్లు, లీజింగ్ కంపెనీల నుండి అథారిటీ ప్రతిపాదనలను ఆహ్వానించింది.
1. సమ్మర్ పీక్ : జూలై 1, 2025 నుండి ఆగస్టు 31, 2025 వరకు
2. వింటర్ పీక్ : డిసెంబర్ 1, 2025 నుండి జనవరి 31, 2026 వరకు
ఈ కాలంలో ధోఫర్కు విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడం, సజావుగా కనెక్టివిటీని నిర్ధారించడం ఈ చొరవ లక్ష్యమని పేర్కొన్నారు. ఆసక్తిగల పార్టీలు మరిన్ని వివరాల కోసం [email protected] లో అధికారులను సంప్రదించాలని వెల్లడించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







