'యు' ఆకారంలో సచివాలయ నిర్మాణానికి యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

- July 06, 2016 , by Maagulf
'యు' ఆకారంలో సచివాలయ నిర్మాణానికి యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

దేశ రాజధాని దిల్లీ నగరంలోని కేంద్ర మంత్రిత్వశాఖల కార్యాలయాల తరహాలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దిల్లీలోని దక్షిణ, ఉత్తర బ్లాక్‌ల తరహాలో మంత్రులు, శాఖాధిపతులకు రెండు బ్లాక్‌లు.. మధ్యలో ముఖ్యమంత్రి బ్లాక్‌ ఉండేలా 'యు' ఆకారంలో సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా దీర్ఘచతురస్రాకార స్థలంలో విశాలమైన ఉద్యానవనాలతో పచ్చదనం ఉట్టిపడేలా నిర్మించనున్నారు. ప్రస్తుతం సచివాలయం ప్రాంగణంలో ఉన్న ప్రార్థనాలయాలను రహదారివైపు తరలించనున్నారు. శ్రావణంలో శంకుస్థాపన చేసి ఏడాదిన్నరలో దీని నిర్మాణం పూర్తిచేసేa దిశగా కసరత్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com