ఎమిర్ - ఈద్ అల్ పితర్ గ్రీటింగ్స్
- July 06, 2016
ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని, అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల నుంచి పలువురు ప్రముఖుల నుంచి ఈద్ అల్ ఫితర్ గ్రీటింగ్స్ని అందుకున్నారు, అలాగే తనకు గ్రీటింగ్స్ తెలిపినవారికి కృతజ్ఞతలు అందజేశారు. ఖతార్ ప్రజలు అభివృద్ధిలో దూసుకుపోవాలనీ ఈ సందర్భంగా ఎమిర్ షేక్ ఆకాంక్షించారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నయెఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నుంచి ఎమిర్ షేక్ సన్మానం అందుకున్నారు. ప్రతిగా ఆయన్ను తిరిగి సన్మానించారు కూడా. భారత ప్రధాని నరేంద్రమోడీతో ఎమిర్ షేక్ గురువారం టెలిఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై ఇరువురు నాయకులు చర్చించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రసిడెంట్ హస్సన్ రోహాని, ఎమిర్ షేక్ పరస్పరం ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ అల్ సిస్సి మరియు సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహమ్మద్తోనూ ఈద్ శుభాకాంక్షల్ని షేర్ చేసుకున్నారు. వివిధ దేశాల ప్రముఖుల నుంచి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఎమిర్ షేక్కి ముంచెత్తాయి.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









