విధ్వంసంతో ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరు: సౌదీ క్రౌన్ ప్రిన్స్
- July 06, 2016
తీవ్రవాదులు విధ్వంసాలతో ప్రజల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఇంటీరియర్ మినిస్టర్ మొహమ్మద్ బిన్ నాయెఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ చెప్పారు. దేశంలో భారీ కుదుపు కోసం తీవ్రవాదులు ప్రయత్నిస్తుంటారనీ, ఇలాంటి ఘటనలతో ప్రజలు అప్పటికప్పుడు భయాందోళనలకు గురైనా, ఆ తర్వాత అంతా ఒక్కటిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే కసిని ప్రదర్శిస్తారనీ, ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తుండడంతో తీవ్రవాదుల ఆటల్ని కట్టించగలుగుతున్నామని ఆయన అన్నారు. భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ, ఇంకా కఠినంగా తీవ్రవాదుల పట్ల వ్యవహరిస్తామనీ, పౌరులకు భద్రత కల్పించేందుకు ఇంకా ఏమేం చర్యల్ని అదనంగా తీసుకోవాలో అన్నీ చేస్తామని తెలిపారాయన. సౌదీలో జరిగిన మూడు పేలుళ్ళలో గాయాలపాలైన పోలీసు అధికారుల్ని, పౌరుల్ని ఆసుపత్రుల్లో పరామర్శించారు ప్రిన్స్ మొహమ్మద్. మదీనా, జెడ్డా మరియు ఖాతిఫ్లలో జరిగిన పేలుళ్ళలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







