విధ్వంసంతో ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరు: సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌

- July 06, 2016 , by Maagulf
విధ్వంసంతో ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరు: సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌

తీవ్రవాదులు విధ్వంసాలతో ప్రజల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌, ఇంటీరియర్‌ మినిస్టర్‌ మొహమ్మద్‌ బిన్‌ నాయెఫ్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ చెప్పారు. దేశంలో భారీ కుదుపు కోసం తీవ్రవాదులు ప్రయత్నిస్తుంటారనీ, ఇలాంటి ఘటనలతో ప్రజలు అప్పటికప్పుడు భయాందోళనలకు గురైనా, ఆ తర్వాత అంతా ఒక్కటిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే కసిని ప్రదర్శిస్తారనీ, ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తుండడంతో తీవ్రవాదుల ఆటల్ని కట్టించగలుగుతున్నామని ఆయన అన్నారు. భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ, ఇంకా కఠినంగా తీవ్రవాదుల పట్ల వ్యవహరిస్తామనీ, పౌరులకు భద్రత కల్పించేందుకు ఇంకా ఏమేం చర్యల్ని అదనంగా తీసుకోవాలో అన్నీ చేస్తామని తెలిపారాయన. సౌదీలో జరిగిన మూడు పేలుళ్ళలో గాయాలపాలైన పోలీసు అధికారుల్ని, పౌరుల్ని ఆసుపత్రుల్లో పరామర్శించారు ప్రిన్స్‌ మొహమ్మద్‌. మదీనా, జెడ్డా మరియు ఖాతిఫ్‌లలో జరిగిన పేలుళ్ళలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com